ముంబై డ్రగ్ కేసు ; షారుఖ్‌ అపాయింట్‌ మెంట్‌ అడిగిన కొడుకు ఆర్యన్‌

-

ముంబై లోని క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో గంట.. గంటకు కీలక మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో డ్రగ్‌ పెడ్లర్‌ సహా మరోకరు అరెస్ట్‌ అయ్యారు. ఇక ఈ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ విచారణ ను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ ను ఎన్సీబీ ప్రశ్నిస్తోంది. అయితే.. ఈ ఎన్సీబీ విచారణ లో ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అంతేకాదు.. షారూఖ్‌ ఖాన్‌ పై ఆర్యన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తన తండ్రి షారూఖ్‌ ఖాన్‌ ఎప్పుడూ చాలా బీజీగా ఉంటారని చెప్పిన ఆర్యన్‌… తన తండ్రిని కలవడానికి అపాయింట్‌ కావాలని ఎన్సీబీ అధికారులను కోరాడు. మేనేజర్‌ దగ్గర అపాయింట్‌ మెంట్‌ తీసుకున్నాకే… తన తండ్రి షారూఖ్‌ ఖాన్‌ ను కలుస్తానని ఆర్యణ్‌ ఖాన్‌ వెల్లడించారు. అయితే.. దీనిపై ఎన్సీబీ అధికారులు సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. కాగా.. నాలుగు రోజుల కిందనే ఆర్యణ్‌ ఖాన్‌.. డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news