ఢిల్లీపై ముంబై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్‌సీబీ

-

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముంబై బ్యాటర్లలో కిషన్‌(48),బ్రేవిస్‌(37), డేవిడ్‌ (34) పరుగులతో రాణించారు.

Mumbai Indians vs Delhi Capitals IPL 2022 – Cricket Match Prediction,  Fantasy XI Tips & Probable XI On Cricketnmore

ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే,శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పావెల్(43), పంత్‌(39) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, రమణదీప్ సింగ్ రెండు, సామ్స్‌, మయాంక్ మార్కండే తలా వికెట్‌ సాధించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news