పెళ్లి చేసుకోమని అడిగిన పాపానికి యువతిని 30 ముక్కలు చేసిన ప్రియుడు… !

-

ఈ మధ్యన దేశంలో లైంగిక సంబంధాల కారణంగా హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి, తాత్కాలిక శారీరక సుఖం కోసం జీవితాలనే పణంగా పెట్టి కుటంబాలను వీధిన పడేస్తున్నారు. తాజాగా ఒరిస్సాలో ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. గతంలో ఢిల్లీ లో శ్రద్దా ను ఏ విధంగా తన ప్రియుడు 35 ముక్కలుగా చేసి చంపాడో… ఒడిశాలో ఒక జంట యువతిని 30 ముక్కలుగా చేసి చంపడం మహాదారుణం అని చెప్పాలి. చంద్రా రౌత్ అనే వివాహితుడు తిలావతి అన్న ఒక యువతిని ప్రేమించినట్లు నటించి ఆమెను మోసం చేశాడు. దీనితో సదరు యువతి మోసం చేసిన తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆగ్రహించిన చంద్ర తన భార్య తో కలిసి తిలావతిని దారుణంగా హత్య చేసి శరీరాన్ని 30 ముక్కలుగా నరికి అడవిలో పాతి పెట్టాడు. ఇక అమ్మాయి కనిపించడం లేదని పేరెంట్స్ కేస్ పెట్టడంతో పోలీసులు విచారణలో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది.

శరీర వాంఛ కోసం పెళ్లి అయినా కామాంధుడు హత్య చేసిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news