యోగి దెబ్బకు పోలీసుల చెంతకు నేరగాడు.. ఎన్​కౌంటర్ చేయొద్దని వేడుకోలు

-

నేరాలకు అడ్డుకట్ట వేయడంలో యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు. మొన్నటిదాక బుల్డోజర్ తో నేరగాళ్ల గుండెల్లో రైలు పరిగెట్టించిన యోగి.. ఇప్పుడు నేరాలు చేసినవారిని ఎన్ కౌంట్ చేస్తామంటూ భయానికి గురిచేస్తున్నారు. యోగి వార్నింగ్ సీరియస్ గా తీసుకున్న ఓ నేరస్థుడు స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతటితో ఆగకుండా తాను లొంగిపోతానని, జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని, తనను ఎన్​కౌంటర్​ చేయొద్దని అట్టపైన రాసి మెడలో వేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్​లో జరిగింది.

గాజియాబాద్ లోని​ పోలీస్ స్టేషన్​ పరిధిలో సెప్టెంబర్​ 9న ఓ హత్య జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అవసరమైతే నిందితుడిని ఎన్​కౌంటర్​ చేస్తామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ.
దీంతో హడలిపోయిన నిందితుడు సొహైల్​.. తాను జీవితంలో మరోసారి నేరం చేయనని.. తనను ఎన్​కౌంటర్​ చేయవద్దని మెడలో బోర్డు తగిలించుకుని వచ్చి పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version