సూర్యాపేట జిల్లాలో దారుణం..కన్న తండ్రిని దారుణంగా చంపిన కొడుకు !

-

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని దారుణంగా చంపేశాడు కొడుకు. పెన్ పహాడ్ మండలం నారాయణ గూడెంలో నంద్యాల అంజిరెడ్డి అనే వృద్దుడు దారుణ హత్యకు గురయ్యాడు… అంజి రెడ్డిని కుమారుడు అమరసింహారెడ్డి హత్య చేశాడు. లండన్ లో కొంతకాలం ఉండి డ్రగ్స్ కు బానిస గా మారి మూడేళ్ళ క్రితం అమరసింహారెడ్డి ఇండియా వచ్చాడు. లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి అమరసింహారెడ్డి తిరుగుతునన్నాడు.

murder
murder

భార్య చనిపోవడంతో కుమారుడుతో కలిసే ఉంటున్నాడు అంజిరెడ్డి. అయితే ఏమయిందో ఏమో తెలియదు కానీ తెల్లవారుజామున 3 గంటలకు కన్న తండ్రి అంజిరెడ్డిని బండ రాయితో మోదీ అమరసింహారెడ్డి హత్య చేశాడు. తానే చంపానని పోలీసుల ఎదుట నిందితుడు ఒప్పుకున్న నేపధ్యంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. మతి స్థిమితం లేకపోవడంతోనే తండ్రిని చంపాడని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news