‘ఆచార్య’ సినిమా రచ్చ పై క్లారిటీ..!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా కథ తమదేనంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ, రాజేశ్ మండూరి అనే ఇద్దరు రచయితలు వేర్వేరుగా ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని తాజాగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాను కొరటాల శివ తయారుచేసిన ఒరిజినల్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నామని వెల్లడించింది.

కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సమర్పిస్తున్న ఈ సినిమాను మైత్రి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఆచార్య షూటింగు దశలో ఉంది. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇటీవ‌లే చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న రిలీజ్ అయిన ఆచార్య పోస్ట‌ర్‌ కు మంచి స్పందన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news