ముఖ్యమంత్రికి దమ్ముంటే 26 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ లో వస్తారా? – నాదెండ్ల మనోహర్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడితే దమ్ముందా? దమ్ముందా? అని మాట్లాడుతున్నారని, అసలు ఆయనకే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల సీఎం జగన్ తెనాలిలో పర్యటించిన విషయం తెలిసిందే. రైతు భరోసా పథకం నిధుల పంపిణీ కోసం జగన్ తెనాలి వెళ్లారు.

అయితే తాడేపల్లి నుంచి తెనాలికి సీఎం జగన్ హెలికాప్టర్ ప్రయాణం ఇప్పుడు విమర్శలకు కారణం అవుతుంది. నిజంగా జగన్ కి దమ్ముంటే 26 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ లో వస్తారా? అని ప్రశ్నించారు నాదేండ్ల మనోహర్. జగన్ ఒంటరిగా పోటీ చేస్తే మా వ్యూహం మాకు ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆ వ్యూహాన్ని వెల్లడిస్తారని చెప్పారు నాదెండ్ల. ప్రభుత్వ కార్యక్రమంలో అభివృద్ధి గురించి కాకుండా రాజకీయ సవాళ్లు చేయడం ఏమిటని విమర్శించారు. జన సైనికులంతా వైసిపి విముక్త ఏపీ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news