నాగ్ – అఖిల్ మ‌ల్టీస్టార‌ర్ నిజ‌మెంత‌?

-

అక్కినేని నాగార్జున ఓ ప‌క్క రియాలిటీ షో బిగ్‌బాస్ చేస్తూనే మ‌రో ప‌క్క వ‌రుస పెట్టి సినిమాల్ని లైన్‌లో పెడుతున్నారు. తాజాగా ఆయ‌న మ‌రో చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. త‌న త‌న‌యుడు అఖిల్ తో క‌లిసి మ‌ల్టీస్టారర్ మూవీ చేయ‌బోతున్నార‌ట‌. ఇంత‌కు ముందు చైతో క‌లిసి నాగ్ `మ‌నం` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.

ఏఎన్నారో కూడా ఇందులో చివ‌రి సారిగా న‌టించారు. ఇదే మూవీలో అఖిల్ చివ‌ర్లో అతిథి పాత్ర‌లో మెరిసారు. గ‌త కొంత కాలంగా నాగార్జున‌, అఖిల్ క‌లిసి న‌టిస్తే చూడాల‌ని అక్కినేని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాగార్జున – అఖిల్‌ల క‌యిక‌లో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ని ప్లాన్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో అనిల్ రావిపూడి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ప్రీవియ‌స్ ఫిల్మ్స్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడితో సినిమా చేయాలిన నాగ్ ఫిక్స‌య్యార‌ట‌. అనిల్ రావిపూడి చెప్పిన క‌థ నాగ్‌కి న‌చ్చ‌డంతో వెంట‌నే అత‌నికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news