గెస్ట్ అప్పియరెన్స్: ధనుష్ సినిమాలో గెస్ట్ పాత్రలో “మన్మధుడు” … !

-

తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే తమిళ హీరోలలో ధనుష్ ఒకరు. ఈయన సినిమాలంటే తెలుగు యూత్ చెవులు కోసుకుంటారు.. ఈయన నటనకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మశక్యం కాదు. ఇక తాజాగా ధనుష్ త్వరలో నటించనున్న ఒక సినిమాలో అతిధి పాత్ర కోసం టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునను చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. కాగా నాగార్జున ఎటువంటి పాత్రలు అయినా, భాష ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంతకు ముందు కార్తీ సినిమాలో నటించారు. ఇప్పుడు కథ డిమాండ్ ను బట్టి నాగార్జునను ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటింపచేస్తున్నారట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న ధనుష్ మూవీలో నాగార్జున ఒక కీలక పాత్ర చేయనున్నాడట. ఇందుకోసం నాగార్జున నాలుగు వారల పాటు షూటింగ్ లో పాల్గొంటారని వినికిడి.

ఈ సినిమా తెలుగు, తమిళ మరియు హిందీ బాషలలో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రహ్మాన్ చేయనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news