చైతూ-సమంత విడాకులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు

-

గత నాలుగు నెలల కిందట.. అక్కినేని నాగచైతన్య- హీరోయిన్‌ సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వీరు విడిపోయినట్లు ప్రకటించిన అనంతరం నుంచి ఇప్పటి వరకు చాలా వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఆ పుకార్లపై అటు సమంత ఇటు చైతూ క్లారిటీ ఇస్తూనే వచ్చారు.

అయితే.. తాజాగా ఈ వార్తలపై స్వయంగా… అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగార్రాజు సక్సెస్‌ తో జోష్‌ లో ఉన్న ఆయన.. ఓ ఇంగ్లీష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కావాలనే కొందరు ఇలాంటి చెత్త ప్రచారాలను చేస్తున్నారని.. ఇద్దరి విడాకులపై లేని పోనివి పుట్టిస్తున్నారని మండి పడ్డారు. ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానెళ్ల లో ఇలాంటి వాటికి కొదువ లేకుండా పోయిందని మండిపడ్డారు. తన పై ఇలాంటి చెత్త ప్రచారాలు చేసినా… పట్టించుకోలేదని..కానీ నా కుటుంబంపై నిందలు వేస్తే ఊరుకోనని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news