దేశంలో హిందువులకు ముప్పు రాబోతుంది: జీవీఎల్‌ నరసింహారావు

-

జీవిఎల్ నరసింహారావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లో ప్రజాగ్రహ సభ ద్వారా నిద్ర లేకుండా చేసి శరణు ప్రభు అంటూ ఢిల్లీ వెళ్లాలా చేసామని.. దేశంలో హిందువులకు ముప్పు రాబోతుందన్నారు. పీఎఫ్ ఐ వంటి సంస్థలు ఐఎస్ ఐ కనుసన్నల్లో ఆపని చేస్తుందని… ఢిల్లీలో పీఎఫ్ఐ మత అల్లర్లు సృష్టించిందని నిప్పులు చెరిగారు. కేరళలో ప్రొఫెసర్ చేతిని నరికేశారని.. పీఎఫ్ఐ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఆగ్రహించారు.

జగన్ ప్రభుత్వానికి హెచ్చరిక…ఈ సంస్థను నిర్ములించకుంటే పార్లమెంటులో పోరాడుతామమని స్పష్టం చేశారు. 5 శాతం ముస్లిం లు, ఒక శాతం క్రిస్టియన్లు ఉంటే ప్రతి వాడాలో మసీదులు, చర్చిలు నిర్మిస్తుందని… నరేగా నిధులతో ఇవి నిర్మిస్తారా అని ప్రశ్నించారు. అన్యమత సంస్థల ఆస్తులపై ఉన్న శ్రద్ధ హిందూ ఆస్థులపై ఎందుకు లేదని.. లవ్ జిహాద్ చేస్తున్న పీఎఫ్ ఐ పై ఎందుకు చర్య తీసుకోలేదన్నారు. మాధరసలను మూసి వేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news