నాయిని పరిస్థితి అత్యంత విషమం.. ఆసుపత్రికి కేసీఆర్ !

-

టీఆర్ఎస్ నేత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కరోనా నుంచి కోలుకోన్న నాయిని న్యూమోనియా వ్యాధితో జూబ్లిహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా నెగిటివ్‌ వచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత ఆయనకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు..నాయిని న్యూమోనియాతో బాధపడుతున్నాడని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం నాయిని అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు. మాజీ మంత్రి నాయిని పరిస్థితి మరింత విషమంగా ఉందని ఆయన చికిత్సకు స్పందించడం లేదని చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇక మరి కాసేపట్లో అపోలో హాస్పిటల్ కి సిఎం కేసీఆర్ వెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news