కర్నూలులో విలువైన వజ్రం..ఆ మహిళ దశని మార్చేసిందిగా…!

-

కర్నూలు జిల్లాలో ఊహించని విధంగా ఓ మహిళ లక్షాధికారి అయిపోయింది. వెతకబోయిన వజ్రం ఆ మహిళ చేతికి తగిలినట్టైంది. అనుకోకుండా దొరికిన ఆ వజ్రం ఆ మహిళ దశ, దిశను మార్చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏరియా రంగురాళ్లకు కూడా ఫేమస్‌. అయితే వర్షాలు తగ్గడంతో వేరుశెనగ తీస్తుండగా… ఓ మహిళకు ఏడు క్యారెట్ల వజ్రం దొరికిందట..

దానిని గుత్తికి చెందిన వ్యాపారి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చి కొన్నాడని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అలాగే డబ్బుతో పాటు రెండు తులాల బంగారం కూడా ఆమెకు ఇచ్చాడట. అంత పెట్టి ఆ వజ్రాన్ని వ్యాపారి కొంటే… ఈ వజ్రం విలువ కోటి రూపాయల వరకు ఉండొచ్చని
గుసగుసలాడుకుంటున్నారు స్థానికులు
.

Read more RELATED
Recommended to you

Latest news