నల్గొండలో 12 సీట్లు గెలుస్తాం..కేటీఆర్

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సమక్షంలో నేడు తెరాసలో చేరారు.  తెలంగాణలో తెరాస ప్రభుత్వ పనితీరుకి ప్రజలు నూటికి నూరు మార్కుల వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జౌరంగజేబు నుంచి చంద్రబాబు వరకు అందరు వెన్నుపోటు రాజకీయాలో చేశారని అన్నారు. నాడు ఎన్ని సార్లు ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ కే పట్టంగట్టారని గుర్తు చేశారు. దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు పేరు రావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేపోతున్నారన్నారు. 2006 నుంచి 2014వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్యమం సమయంలో జైళ్లో పెట్టించిన నేతలు ఈ రోజు కుటుంబ పాలన, తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news