ఐపీఎల్ 2022 : అహ్మ‌దాబాద్ ఫ్రొంచైజీ పేరు ప్ర‌క‌ట‌న

-

రాబోయే ఐపీఎల్ కోసం అన్ని ఫ్రొంచైజీలు సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది కొత్త‌గా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొంచైజీలు కూడా రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొంచైజీలు త‌మ ముగ్గురు ఆట‌గాళ్లును ప్ర‌క‌టిచాయి. అలాగే ల‌క్నో ఫ్రొంచైజీ పేరు కూడా ప్ర‌క‌టించింది. తాజా గా అహ్మ‌దాబాద్ ఫ్రొంచైజీ కూడా పేరును అధికారికంగా ప్ర‌క‌టించింది. మెగా వేలానికి ఐదు రోజుల ముందు తమ ఫ్రొంచైజీ పేరును అహ్మ‌దాబాద్ ప్ర‌క‌టించింది.

అహ్మ‌దాబాద్ టైటాన్స్ గా అహ్మ‌దాబాద్ యాజ‌మాన్యం అయిన సీవీసీ సంస్థ పేరును ప్ర‌క‌టించింది. అయితే మెగా వేలానికి కేవ‌లం ఐదు రోజుల ముందే హ‌డావుడిగా సీవీసీ సంస్థ త‌మ ఫ్రొంచైజీ పేరును ప్ర‌క‌టించింది. ఎది ఏమైనా.. అహ్మ‌దాబాద్ టైటాన్స్ అని బీసీసీఐ వ‌ద్ద పేరును న‌మోదు చేసుకుంది. కాగ ఈ నెల 12, 13 తేదీల‌లో ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జ‌ర‌గ‌నుంది. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూర్ వేదిక‌గా ఈ మెగా వేలం జ‌ర‌గ‌నుంది.

కాగ అహ్మ‌దాబాద్ టైటాన్స్ జ‌ట్టు ఇప్ప‌టికే ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను రిటెన్షన్ ప్ర‌క్రియాలో భాగంగా ఎంచుకుంది. రూ. 15 కోట్లు వెచ్చించి.. హార్ధిక్ పాండ్యను తీసుకుంది. అలాగే కెప్టెన్ గా కూడా నియ‌మించింది. అలాగే ఆఫ్థాన్ స్టార్ స్పిన్న‌ర్ రషీద్ ఖాన్ ను కూడా రూ. 15 కోట్లు వెచ్చించింది. అలాగే యువ సంచ‌ల‌నం శుభ్ మాన్ గిల్ కోసం రూ. 8 కోట్లు ఖ‌ర్చు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news