చంద్రబాబు ఎదుట 200 కొబ్బరికాయలు కొట్టిన‌ బాలయ్య ఫ్యాన్స్..(వీడియో)

-

టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు నేడు శ్రీకారం చుట్టారు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అని భావిస్తున్నమాజీ సీఎం చంద్రబాబు నేటి నుండి సమర శంఖం పూరిస్తున్నారు. 45 రోజుల పాటు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటానికి తీసుకున్న నిర్ణయం మేరకు ఆయన రంగంలోకి దిగి 9నెలల పాలనలో 9 రద్దులు, మోసాలు, భారాలను ప్రజలకు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఎదుట నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ రోజు 200 కొబ్బరికాయలు కొట్టారు.

45 రోజుల పాటు ప్రజాచైతన్య యాత్ర మొత్తం 13 జిల్లాల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు బయలుదేరిన నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బాలకృష్ణ అభిమానులు ఆయనకు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ‘ప్రజల మంచి కోసం, శ్రేయస్సు కోసం “నేనున్నాను” అని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రజాచైతన్య యాత్ర విజయవంతం కావాలని 200 కొబ్బరికాయలు కొట్టిన విజయవాడ నందమూరి బాలకృష్ణ అభిమానులు’ అంటూ తెలుగు దేశం పార్టీ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news