ఏపీ లోని అత్యంత కీలక నేత ని చంపడానికి ప్లాన్ చేస్తున్న తీవ్రవాదులు ??

-

ఏపీ రాజకీయాలలో కీలక నేతగా రాణిస్తున్న టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కొడుకు ఎమ్మెల్సీ నారా లోకేష్ ని చంపడానికి తీవ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత కళావెంకట్రావు అంటున్నారు. ఇందువల్లనే నారా లోకేష్ కి భద్రత తగ్గించారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తీవ్రవాదుల నుండి నారా లోకేష్ కి ప్రమాదం ఉన్న ఈ సమయంలో భద్రత తగ్గించడం ఏంటి అంటూ కళా వెంకట్రావు ప్రశ్నించారు. Image result for kala venkat rao lokesh

దీంతో ఒక్కసారిగా టెర్రరిస్టుల నుండి నారా లోకేష్ కి థ్రెట్ ఉన్నట్లు కళా వెంకట్రావు కామెంట్లు చేయడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే తరుణంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కి కూడా భద్రత తగ్గించి వేశారని అసలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని కళా వెంకట్రావు ప్రశ్నిస్తున్నారు.

 

ఏకంగా 146 ఉండవలసిన చంద్రబాబు భద్రత 67 తగ్గిపోయిందని ఏపీ ప్రభుత్వం తగ్గించిందని కళా వెంకట్రావు ఆరోపించారు. ఇదంతా కక్ష సాధింపు చర్య అన్నట్టుగా మాట్లాడారు. దీంతో చంద్రబాబు కి గాని నారా లోకేష్ కి గాని తీవ్రవాదుల నుండి ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఏపీ ప్రభుత్వమే అంటూ కళావెంకట్రావు సీరియస్ అయ్యారు. 

Read more RELATED
Recommended to you

Latest news