నందమూరి ఫాన్స్ – నివేదా థామస్ కి చుక్కలు చూపిస్తున్నారు !!

-

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ నగరంలో శిల్పకళావేదికలో చాలా గ్రాండ్ గా జరిగింది. రజనీకాంత్ అభిమానుల మధ్య జరిగిన ఈ వేడుకలో సినిమాలో కీలకమైన క్యారెక్టర్ వేసిన నివేద థామస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.

 

ఈ సందర్భంగా నివేదిక థామస్ మాట్లాడుతూ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలాంటి లెజెండ్ పర్సనాలిటీ పక్కన నటించడం నా అదృష్టం అని మాట్లాడుతూ తెలుగు స్టార్ హీరోలు పవన్, చిరంజీవి, మహేష్, అల్లు అర్జున్, నాని ఫ్యాన్స్ కూడా రజిని సర్ సినిమాలు చూస్తారని చెప్పింది నివేదా థామస్. అయితే నానితో నటించింది కాబట్టి అతని గురించి చెప్పి ఉండొచ్చు కాని వారితో నటీంచకపోయినా మహేష్, అల్లు అర్జున్, చిరు, పవన్ ల పేర్లు ప్రస్థావించింది నివేదా థామస్.

 

అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ లాంటి సినిమా చేసి కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించక పోవటం తో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు నివేదిక థామస్ పై సెటైర్లు వేస్తున్నారు. కొంతమంది విపరీతమైన కామెంట్లు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news