జగన్ మత్తు పదార్థాలకు అక్రమాలకు అంబాసిడర్ : లోకేష్

-

 

మరోసారి సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పిరికివాడు ప్రధాన మంత్రిని మించి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. భయటకు వెళ్ళాలంటే సీఎం జగన్ కు భయం.. సాయంత్రమైతే వాటలు గురించే చర్చిస్తాడు.. ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని కొనియాడిన లోకేష్.. జగన్ మత్తు పదార్థాలకు అక్రమాల కు అంబాసిడర్ అంటూ ఆరోపించారు. చంద్రబాబు విజనరీ..జగన్ ప్రిజనరీ.. అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయిన నాటి నుంచి నిత్యవసరాల‌ ధరలు చుక్కలు చూస్తున్నాయంటూ ఆయన ధ్వజమెత్తారు.

అంతేకాకుండా మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రాలకు వెళ్లి బ్రతకాల్సిందేనని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు రోజూ ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version