జనసేన నాయకుడి ఇంటిపై వైసీపీ దాడి..నారా లోకేష్ సీరియస్

-

జనసేన నాయకుడి రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. అయితే, ఈ సంఘటనపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహిస్తుంటే, ఇటు పుంగనూరులో ముఖ్యమంత్రి తరువాత నెంబర్ 2 స్థానంలో వున్న మంత్రి పెద్దిరెడ్డి గారు బీసీ నేతలని అంతమొందించే కుతంత్రాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

బీసీ అయిన పుంగనూరు జనసేన నాయకుడు రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రామచంద్రయాదవ్ బీసీ కావడమే నేరమా? రైతు సదస్సు నిర్వహించాలనుకోవడం ద్రోహమా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారూ ప్రశ్నించే వాళ్ల ప్రాణాలు తీయడమేనా మీకు తెలిసిన ప్రజాస్వామ్యం?ఒక బీసీ నేతని అంతమొందించే లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి మనుషులే దాడికి దిగితే, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమని ట్వీట్‌ చేశారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news