అమరావతి పేరు వింటే జగన్ వణికిపోతున్నాడు : లోకేష్

-

జగన్ సర్కార్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అమరావతి పేరు వింటేనే సిఎం జగన్ వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణిచివేతకి ఎదురొడ్డి నిలిచి మహోద్యమం అయ్యిందన్నారు. జై అమరావతి పోరాటం 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ..శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపి…వ్యాన్లలో కుక్కారని మండిపడ్డారు.

చాలా మందిని సెల్ లో బంధించారు… రైతుల కాళ్లు విరగ్గొట్టారు.మహిళల పట్ల మగపోలీసులు అనుచితంగా ప్రవర్తించారని నిప్పులు చెరిగారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధుల్ని నిర్బంధించారని పేర్కొన్నారు. ఖాకీల వలయాన్ని ఛేదించుకుని మంగళగిరి దేవస్థానం చేరుకుని జై అమరావతి అని నినదించడమే నేరంగా జైళ్లలో బందీలైన రైతులు,మహిళలు, టిడిపి నేతలు, ఉద్యమకారుల పోరాటానికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. న్యాయమైన మీ పోరాటానిదే అంతిమ విజయమని… అమరావతి శాశ్వతమని పేర్కొన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news