కడప జైల్లో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌కు నారా లోకేశ్‌ పరామర్శ

-

ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డిని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరామర్శించారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రవీణ్ ని ములాఖత్‌ ద్వారా వెళ్లి కలిశారు. గత కొద్ది రోజులుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రవీణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ప్రవీణ్‌ను కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు లోకేశ్ కడప వచ్చారు.  లోకేశ్‌కు ఎయిర్ పోర్టులో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై నేతలతో లోకేశ్.. విమానాశ్రయంలోనే కాసేపు చర్చించారు.

కడప సెంట్రల్‌ జైలులో ఉన్న ప్రవీణ్‌ కుమార్‌రెడ్డితో ములాఖత్‌కు 18 మందికి పోలీసులు అనుమతించారు. లోకేశ్‌తో పాటు మరో 17 మంది నేతలను మాత్రమే ఆయన్ను కలిసేందుకు పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news