వైసీపీ తలలు పగులుతాయి.. ఇక ఊరుకోం : నారా లోకేష్ వార్నింగ్

-

వైసీపీ ఇంకా ఇదే విధంగా రెచ్చగొట్టినా.. దాడులు చేసినా చూస్తూ ఊరుకోం.. తలలు పగులకోడతామని వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ… ప్రజల కోసం పోరాడుతోంటే కేసులు పెడుతున్నారని.. నేను బర్న్ రెడీ.. జైలుకెళ్లడానికైనా సిద్దమన్నారు. నేనేం దేశాన్ని దొబ్బి జైలుకెళ్లడం లేదని.. పార్టీ కార్యాలయంలోకి జొరబడ్డ సీఐను కాఫీ, టీ ఇచ్చి పంపితే హత్యాయత్నం కేసు పెట్టారని ఫైర్ అయ్యారు. మైదుకూరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు.. హత్యకు ప్రేరేపించడం కాదా..? పార్టీ కార్యాలయం పై దాడి చేసిన రోజు మేం రెచ్చగొడితే డీజీపీ ఆఫీస్ ఉండేదా..? అని ప్రశ్నించారు.

ys jagan on nara lokesh

పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో సీఎం జగన్ డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లోకి వచ్చిందని.. సీఎం జగన్ తీరుపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారని చురకలు అంటించారు. పార్టీ గుర్తింపు రద్దు చేయమని వైసీపీ ఫిర్యాదు చేస్తే చేసుకోనివ్వండి.. నష్టం లేదన్నారు. కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఏపీలో పోలీసింగ్ దెబ్బతిందని… పోలీసింగ్ దెబ్బతినడం వల్లే గంజాయి సాగు, సరఫరా పెరుగుతోందని మండిపడ్డారు. గంజాయి సాగు, సరఫరా పెరుగుతోన్నా.. సీఎం కట్టడి చేయడం లేదని.. కేజీ గంజాయికి ఇంత అని ముడుతుండడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే అనుమానం వస్తోందన్నారు.

డ్రగ్స్ కట్టడి చేయకుంటే ఓ జనరేషన్ దెబ్బ తింటుందని.. అందుకే మేం ఫోకస్ పెట్టామని చెప్పారు. ఢిల్లీకి వెళ్తాం.. డ్రగ్స్, గంజాయి గురించి ఫిర్యాదు చేస్తాం.. పార్టీ కార్యాలయంపై దాడి విషయాన్ని ప్రస్తావిస్తామన్నారు. అమిత్షాకు ఫోన్ చేశాం.. చంద్రబాబు ఫోన్ చేశారో.. లేదో.. సజ్జలే అమిత్షాకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చుగా..? అని చురకలు అంటించారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news