ట్రంప్ కి కరోనా.. మోడీ ఏమన్నారో తెలుసా..?

-

శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్ ఎవ్వరిని వదల్లేదు. సామాన్యుడు సెలబ్రిటీ అనే తేడా చూడటం లేదు. అందరిపై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. ఈ విషయం మరోసారి రుజువైంది. అమెరికాలో రోజురోజుకు విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి పై కూడా పంజా విసిరింది. దీంతో ఇది కాస్త ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.

ఇక ప్రస్తుతం ట్రంప్ దంపతులు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తన మిత్రుడు ట్రంప్, అతని సతీమణి త్వరగా కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కావాలి అంటూ ఆకాంక్షిస్తున్నాను అని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే మరికొన్ని రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ప్రచార హోరు అంతకంతకూ పెరుగుతున్న వేళ ట్రంప్ కరోనా వైరస్ బారిన పడటం మరింత చర్చనీయాంశం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version