ఒకే రూంలో నరేష్, పవిత్ర.. పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసిన రమ్య.!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ తో కలిసి జంటగా ఎన్నో చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాలలో వీరిద్దరి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

ఇకపోతే గత కొద్ది రోజులుగా నరేష్ అలాగే పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. అవును అందరూ అనుకున్నట్లే జరిగింది. టాలీవుడ్‌ నటుడు నరేష్‌ మరో వివాహం చేసుకున్నాడు. మైసూర్ లో పవిత్ర-నరేష్ ల జంట వివాహం చేసుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి.

నెల కిందటే పవిత్ర- నరేష్ ల పెళ్లి జరిగిందని సమాచారం అందుతోంది. అయితే.. తాజాగా మైసూరులోని ఓ అపార్టుమెంట్‌లో ఉండగా నరేష్-పవిత్ర లోకేష్ జంటను అడ్డుకునేందుకు ప్రయత్నించింది నరేష్ మూడో భార్య రమ్య. అంతేకాదు.. పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్టబోయింది రమ్య. అయితే.. రమ్యను అడ్డుకున్నారు పోలీసులు. అటు రమ్యను చూసి విజిల్స్ వేస్తూ వెళ్లిపోయాడు నరేష్.

Read more RELATED
Recommended to you

Latest news