విశ్వకర్మల కోసం 15,000 కోట్లతో ప్రత్యేక పథకం – ప్రధాని మోదీ

-

విశ్వకర్మల కోసం 15,000 కోట్లతో ప్రత్యేక పథకం అమలు చేయబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు ప్రధాని మోదీ.

స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలను చేసిన మహనీయులను స్మరించుకున్న ప్రధాని మోదీ…ఈ సారి ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేశాయన్నారు. పలు ప్రాంతాల్లో ఊహకందని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. కష్టకాలంలో బాధితులకు దేశ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు ప్రధాని మోదీ. వచ్చే నెలలో విశ్వకర్మల కోసం 13 వేల నుంచి 15,000 కోట్లతో ప్రత్యేక పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news