జూన్ 2న తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది – స్పీకర్‌ పోచారం

-

జూన్ 2న తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మత విద్వేషాలు, మత కలహాలు సృష్టించడం దేశానికి ఎప్పుడూ మంచిది కాదన్నారు.

పోరాటం చేసి స్వాతంత్రం సాధించుకున్నామని పేర్కొన్నారు. కొంతమంది పార్టీల నాయకులు తెలంగాణ మేమివచ్చాం అనే మాటలు తప్పు అని వివరించారు. తెలంగాణ ఇవ్వలేదు- కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి తెచ్చుకున్నామన్నారు. జూన్ – 2న తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని స్పష్టం చేశారు.రూపాయి పతనం అవుతోంది- నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయన్నారు. దేశాన్ని పాలించే నాయకుల పద్ధతులు, ఉద్దేశాలు మారాలని కోరారు నువ్వెంతా- నేనెంతా అనే మాటలు వద్దని.. అమలు కానీ, చేతకాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌, బీజేపీలపై ఫైర్‌ అయ్యారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news