పార్లమెంటుకు ఈసారి 280 మంది కొత్తవారు

-

లోక్‌సభకు ఈసారి 280 మంది తొలిసారిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు, సినీ నటులు, రాజకీయ కార్యకర్తలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 45 మంది తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నవారు. వారిలో టీవీ రాముడు అరుణ్‌ గోవిల్, కాంగ్రెస్‌ నేత కిశోరీలాల్‌ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఉన్నారు.

మరోవైపు మహారాష్ట్ర నుంచి 33 మంది కొత్తవారుండగా.. వారిలో ఉపాధ్యాయుడు భాస్కర్‌ భాగ్రే, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రుల్లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నారాయణ్‌ రాణె, త్రివేంద్రసింగ్‌ రావత్, మనోహర్‌లాల్‌ ఖట్టర్, బిప్లబ్‌ కుమార్‌ దేబ్, జితన్‌ రామ్‌ మాంఝీ, బొమ్మై, జగదీశ్‌ షెట్టార్, చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. సినీ నటుల్లో సురేశ్‌ గోపి, కంగనా రనౌత్‌ తొలిసారిగా లోక్‌సభకు వస్తున్నారు. రాజ్యసభ సభ్యుల్లో అనిల్‌దేశాయ్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్రప్రధాన్,  మాండవీయ, పురుషోత్తం రూపాలా లోక్‌సభకు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news