24 గంట‌ల్లో ఆరుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

-

జ‌మ్ముక‌శ్మీర్‌లో పుల్వామా జిల్లాలో శ‌నివారం తెల్ల‌వారుజామున జ‌రి‌గిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఎదురుకాల్పుల్లో ఓ జ‌వాన్ అమ‌రుడ‌య్యాడు. జిల్లాలోని జ‌డూరా ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ ప్రారంభ‌మైంద‌ని ఆర్మీ ప్ర‌తినిధి క‌ల్న‌ల్ రాజేష్ క‌లియా తెలిపారు. భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌వ‌గా, ఓ జ‌వాన్ తీవ్ర‌గా గాయ‌ప‌డ్డాడ‌ని, ద‌‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే జ‌వాన్ మ‌‌‌ర‌ణించాడ‌ని వెల్ల‌డించారు.

ఉగ్ర‌వాదుల కోసం గాలింపు కొన‌సాగుతున్న‌ద‌ని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం కూడా షోపియాన్ జిల్లాలో జ‌రిగిన ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుపెట్టాయి. దీంతో క‌శ్మీర్ లోయ‌లో గ‌త 24 గంట‌ల్లో ఆరుగురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.

Read more RELATED
Recommended to you

Latest news