ట్రీట్మెంట్ చేయడం లేదని హాస్పిటల్ పై నుంచి దూకేసాడు…!

-

కరోనా రోగులకు అందించే చికిత్సపై ఇప్పుడు ఆందోళన ఉంది. వారు ప్రాణాలు తీసుకుంటున్నారు చికిత్స సరిగా చేయడం లేదు అంటూ దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన రోగులు ప్రాణాలు తీసుకునే ఘటనలు మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కరోనా వచ్చి భయంతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక ఘటన జరిగింది.

coronavirus
coronavirus

ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనాకు చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ ఆసుపత్రి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిడదవోలు మండలానికి చెందిన ఓ యువకుడు 14 రోజుల క్రితం కరోనాతో ఆశ్రం ఆసుపత్రి లో చేసాడు. వైద్యం సరిగ్గా చేయడం లేదని తీవ్ర మనస్తాపంతో ఆసుపత్రి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news