300 యూనిట్ల కరెంట్ ఫ్రీ – నిర్మలా సీతారామన్‌

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరెంటు కష్టాలు లేని దేశం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టిబడి ఉందని తెలిపారు. దేశంలో కోటీ ఇండ్లపై రూఫ్ ఆఫ్ సోలార్ సెట్ అప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Financial assistance to 11.8 crore people for rice donors

ప్రతి ఇంటికి 3 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటన చేశారు నిర్మల సీతారామన్. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. వినియోగం పొగ మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయని తెలిపారు. అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్‌ నూతన మార్గాన్ని అన్వేషిస్తోందని వెల్లడించారు. పశ్చిమాసియా, యూరప్‌లో ఉన్న యుద్ధ వాతావరణం కొత్త సవాళ్లను మన ముందుంచిందని పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని కొత్త మార్గంలో వెళ్లే దిశగా భారత్ సుదృఢమైన పాత్రను పోషిస్తోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news