కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం.. ఈసారి బిల్డర్​ ఇంట్లో లభ్యమైన రూ.40 కోట్లు

-

కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిపిన ఐటీ దాడుల్లో ఓ మాజీ కార్పొరేటర్ ఇంట్లో రూ.42 కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. అది మరవక ముందే మరో వ్యక్తి ఇంట్లో తాజాగా రూ.40 కోట్లు దొరికాయి. ఐటీ సోదాల్లో ఇలా రోజూ భారీగా నగదు బయటపడుతుతోంది. రాజాజీనగర్​ కేటమారనహళ్లిలోని బిల్డర్​ అపార్ట్​మెంట్​లోని 5వ అంతస్తులో శనివారం రోజున ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.40 కోట్లు లభ్యమైనట్లు సమాచారం.

అయితే నగదు గురించి బిల్డర్​ను ఆరా తీయగా.. ఓ మాజీ ఎమ్​ఎల్​సీ పేరు చెప్పాడని.. సదరు ఎమ్​ఎల్​సీ సోదరులను అధికారులు విచారించినట్లు తెలిసింది. నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ఆరా తీశారని సమాచారం. సోదాలు ముగిశాక బిల్డర్​కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో దొరికిన డబ్బు గురించి మరింత సమాచారం ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. నగదులో పాటు స్వాధీనం చేసుకున్న కొన్ని డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news