మహారాష్ట్రలో ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

-

మహారాష్ట్రలో ఈరోజు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. గడ్చిరౌలిలోని కంసేలి అటవీ ప్రాంతంలో అటవీప్రాంతంలో సి60 కమాండోలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోగా ఆ చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈరోజు తెలంగాణాలో కూడా మరో ఎన్ కౌంటర్ జరిగింది.

ములుగు జిల్లా మంగపేట మండలం రామచంద్రునిపేట సమీప అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవలే టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును చంపిన మావోయిస్టులని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అరెస్ట్ అయిన ఒక మిలీషియా సభ్యుడు ఇచ్చిన సమాచారంతోనే వారిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్ళగా అక్కడ వారు ఎదురుకాల్పులు చేయగా ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news