75 సెకన్ల ప్రసంగం.. నాలుగు నిమిషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయిన కేరళ గవర్నర్..!

-

కేరళలోని అధికార ఎల్డీఎఫ్, రాష్ట్ర గవర్నర్ మధ్య విబేదాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన ప్రసంగాన్ని కేవలం రెండు నిమిషాల లోపే ముగించడం చర్చకు దారితీసింది. పాలసీ అడ్రస్ లో కేవలం చివరి పేరాను మాత్రమే ఆయన చదవడం గమనార్హం.

ఇవాళ అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కి సీఎం పినరయి విజయన్, స్పీకర్ స్వాగతం పలికారు. అనంతరం సభలో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. నేరుగా చివరి పేరాను చదివి ముగించారు. గత కొంత కాలంగా విజయన్ ప్రభుత్వం పై అసంతృప్తిగా ఉన్న ఆయన.. ప్రభుత్వం ఇచ్చిన 62 పేజీల ప్రసంగాన్ని చదివేందుకు ఇష్టపడలేదు. కేవలం 75 సెకన్లు మాట్లాడారు. 9.02 గంటలలోపు ప్రసంగం ముగించిన ఆయన.. ఉదయం 9.04 గంటలకు సంభ నుంచి వెళ్లి పోయారు. కనీసం సీఎంకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. 

Read more RELATED
Recommended to you

Latest news