కొత్త జంటకు షాక్.. పెళ్లిలో ఏకంగా అందరి ముందే దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు..!

-

ఇండియా వ్యాప్తంగా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి ఐదు రాష్ట్రాల ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తి కాగానే.. ధరలు డబుల్‌ చేసేస్తుంది. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా.. రోజుకు 80 పైసలు కచ్చితంగా పెంచుతున్నారు.

ఇది ఇలా ఉండగా… పెట్రోల్‌ ధరల పెరుగుదలపై నెటిజన్లు, ప్రజలు చాలా సెటైర్లు వేస్తున్నారు. తమిళనాడలోని చెంగల్‌ పట్టు జిల్లా చెయ్యూర్‌ లో వివాహ కార్యక్రమానికి హాజరైన స్నేహితులు వరుడు గ్రేష్‌ కుమార్‌, వధువు కీర్తనలకు సర్‌ ఫ్రైజ్‌ గిఫ్ట్‌ గా పెట్రోల్‌, డీజిల్‌ ను ప్రజెంట్‌ చేశారు. పైనున్న ఫోటోలో కనిపిస్తున్నట్లు వధూవరులు వేదికపై నిలబడి ఉండగా.. వారికి ఒక లీటర్‌ పెట్రోల్‌, ఒక లీటర్‌ డీజిల్‌ బహుమతిగా ఇచ్చారు. ఈ ప్రత్యేక బహిమతిని జంట నవ్వుతూ స్వీకరించారు. అయితే.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news