హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం….ముగ్గురు దుర్మరణం, పలువురికి గాయాలు

-

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. శాయంపేట మండలం మాంధారిపేట వద్ద ఈప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు అక్కడిక్కడే మరణించగా… ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రోజూవారీ కూలీలు మృతి చెందడంతో మృతుల గ్రామంలో విషాదం నింపింది. పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళా కూలీలు…. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మిర్చి తోటల్లో పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న వాహనం ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. సంఘటన స్థలానికి హుటాహుటీగా పరకాల పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఇలా కూలీతో వెళ్తున్న వారి వాహనాలు ప్రమాదంలో పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news