సుశాంత్‌కి హాని ఉందని ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశా.. కేకే సింగ్‌

-

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మ హత్య మలుపులు తిరుగుతూ ఉంది, సుశాంత్‌ తండ్రి విడుదల చేసిన వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన కుమారునికి ప్రాణహాని ఉందని ముంబై పోలీసులకు ఫిబ్రవరి 25న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు మాత్రం పట్టించుకోలేదని, తరువాత 40 రోజులకు సుశాంత్‌ మరణించాడని వివరించారు. తను ఫిర్యాదులో పేర్కొన్న వారిపై చర్యలు తీసుకునిఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.

సుశాంత్‌ మరణం తరువాత కూడా తాను ఫిర్యాదులో పేర్కొన్న వారిని విచారించలేదని ఆరోపించారు. అందుకే తాను పాట్నా పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశానని, పాట్నా పోలీసులు వెంటనే స్పందించారని సింగ్‌ తెలిపారు. నిందులు తప్పించుకునే పనిలో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇంకా పాట్నా పోలీసులు తమకు అండగా ఉండాలని, సత్యానికి అండగా నిలిచినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు మంత్రి సంజయ్ ఝాలకు కృతజ్ఞతలు అంటూ ముగించారు.

అయితే సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడిన కేసులో ముఖ్య నిందితురాలు రియా చక్రవర్తి, అర్ధరాత్రి ముంబైలోని తన నివాసం నుండి పారిపోయింది. ఈ కేసులో రియా తోపాటు మరో ఆరుగురిపై ఐపిసి సెక్షన్లు, 341, 342, 380, 406, 420, 306 కేసులు నమోదు చేశారు .

Read more RELATED
Recommended to you

Latest news