నేడు అఖిలపక్ష సమావేశం

-

ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పా టు చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్ లలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది.

ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. పార్లమెంట్ గ్రంథాలయ భవనంలో గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. పాకిస్థాన్‌తోపాటు, పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం  ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ గురించి రాష్ట్రపతి ముర్ముకు వివరించారు ప్రధాని మోడీ. ఇక పాకిస్తాన్ పై జరిపిన ఆపరేషన్ సిందూర్ గురించి అన్ని పార్టీలకు వివరించడంతో పాటు మున్ముందు ఏం చేయనున్నారనే దానిపై వాటికి చెప్పే అవకాశముంది. ఆపరేషన్ సిందూర్ విషయంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కేేంద్రానికి అండగా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news