బీజేపీని గెలిపిస్తే.. రెండేళ్లలో మావోయిస్టులను ఫినిష్ చేస్తాం – అమిత్‌ షా

-

బీజేపీని గెలిపిస్తే.. రెండేళ్లలో మావోయిస్టులను ఫినిష్ చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. చత్తీస్ఘర్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ..గత డిసెంబర్లో 90 మంది మావోయిస్టులను మట్టు పెట్టామని గుర్తు చేశారు.

Amit Shah’s message to Maoists in Chhattisgarh’s Kanker

ఏపీ, తెలంగాణలో గత పదేళ్లలో మావోయిస్టులను ఏరిపారేశామని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే.. రెండేళ్లలో మావోయిస్టులను ఫినిష్ చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు.బీజేపీ హయాంలో ఒక్క ఉగ్రదాడి జరిగిన దాఖలాలు లేవు. దేశంలోని అన్ని కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషిచేశాం అని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పెంచారు. మా హయాంలో కమ్మరి, టైలర్లు, వడ్రంగులు, పడవలు తయారు చేసే వారు.. ఇతర చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు రూ.13,000 కోట్లు వెచ్చించి నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలతో అనుసంధానం చేశాం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news