తనకు ‘కోవిడ్ నెగెటివ్’ అంటూ వచ్చిన వార్తలపై అమితాబ్ ఫైర్…!

-

ఇటీవల బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ మనవరాలు కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో వారందరికీ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా అమితాబచ్చన్ కరోనా నుండి కోలుకున్నారని, ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని కొన్ని పుకార్లు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. తాను కరోనా వైరస్ నుండి కోలుకున్నట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని, పచ్చి అబద్ధాలని, ఎవరో బాధ్యతారహితంగా సృష్టించినవి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఆయన ఇంకా కోలుకోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఇలా సెలబ్రిటీల మీద ఫేక్ కామెంట్స్ చేయడం నిజంగా విచారించ దగ్గ విషయమే.

Read more RELATED
Recommended to you

Latest news