దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసుపై ఓయూ జేఏసీ నేతలు దాడి…!

-

తాజాగా బంజారాహిల్స్ లో ఉన్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులు దాడి చేశారు. దీంతో ఆఫీస్ ను, ఆఫీసు లోని ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. దీనికి గల ప్రధాన కారణం ఇటీవల ‘ పవర్ స్టార్ ‘ పేరుతో రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమాలు ప్రోమో విడుదల చేస్తోన్న పరిస్థుతులే. పవర్ స్టార్ సినిమాపై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆర్జివి ఆఫీస్ ఎదుట వారు ఆందోళనకు దిగారు.

ram gopal
ram gopal

దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ తన ఇంటికి ఎవరైనా రావచ్చని నాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న పవర్ స్టార్ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను కూడా డబ్బులు పెట్టి చూడాలని ముందుగా చెప్పిన రామ్ గోపాల్ వర్మ, చివరికి తన ఆఫీసు నుండే ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లీక్ కావడంతో దానిని విరమించుకొని యూట్యూబ్ ద్వారా ట్రైలర్ విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news