మరో వారం రోజులు బెయిల్‌ పొడిగించండి..సుప్రీంకు కేజ్రీవాల్‌ వినతి

-

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని పిటిషన్‌ వేశారు. ఇటీవల ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ మంజూరు చేయమని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరడంతో జూన్‌ 1వ తేదీ వరకు సుప్రీం కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 2న  తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.

దిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయనకు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని, మరి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్య బృందం తెలిపింది. సీఎం ఆరోగ్యానికి కీలకమైన వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు కేజ్రీవాల్కు మరో ఏడు రోజులు బెయిల్‌ పొడిగించాలని ఆయన తరపు న్యాయవాది సుప్రీం కోర్టును అభ్యర్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news