అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ధోనీకి ఆహ్వానం

-

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం అయ్యేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ట్రస్టు సభ్యులు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు.

తాజాగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అయోధ్యకు రావాలని ఆహ్వాన పత్రిక అందింది. ఆర్‌ఎస్‌ఎస్ కో ప్రోవిన్స్ సెక్రటరీ ధనంజయ్ సింగ్ స్వయంగా ధోనీని ఆయన నివాసంలో కలిసి వేడుకకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పత్రికను అందించారు. తప్పకుండా వస్తానంటూ ధోనీ చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 10 వేల మందికి పైగా ప్రముఖులకు రామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆహ్వానాలు అందించిన విషయం తెలిసిందే. క్రీడా రంగంలో మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌‌, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్‌లకు కూడా అయోధ్య రాముని ఆహ్వానం అందింది.

Read more RELATED
Recommended to you

Latest news