భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు – మల్లికార్జున ఖర్గే

-

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం కాదన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎన్నికలు, ఓట్ల కోసం జూడో యాత్ర సాగడం లేదన్నారు. తాము స్వేచ్ఛ, సమానత్వం, వాక్ స్వాతంత్రం అనే విలువలను రాజ్యాంగం నుంచి నేర్చుకుంటున్నామని చెప్పారు. అయితే కొన్ని పార్టీలు రాజ్యాంగ విలువలను దెబ్బతీయాలని చూస్తున్నాయని పరోక్షంగా బిజెపి పై విమర్శలు గుప్పించారు.

దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న దుష్టశక్తులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడమే ఈ యాత్ర ఉద్దేశం అని తెలిపారు. ఒకవేళ ఆ కొన్ని పార్టీలకు రాజ్యాంగ విలువలను అదుపులో పెట్టుకునే సమయమే వస్తే.. అప్పుడు ఆ రాజ్యాంగ విలువలే కనుమరుగైపోతాయని అన్నారు. ఏదేమైనా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత మాత్రం మనందరిపై ఉందని అన్నారు మల్లికార్జున ఖర్గే.

Read more RELATED
Recommended to you

Exit mobile version