గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోంది : తమిళిసై

-

తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని బీజేపీ నేత తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దక్షిణ చెన్నై లోక్సభ బీజేపీ అభ్యర్థిగా టికెట్ అందుకున్న తమిళిసై సౌందరరాజన్‌ ప్రచారం షురూ చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఆమె కోయంబేడు శివాలయం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు.

రోడ్డు వెంట ఉన్న ఓ దుకాణంలో వడలు కొని తిన్నానని, దుకాణదారుడు డిజిటల్‌ పేమెంట్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం గురించి ఇంతకన్నా ఇంకెలా చెప్పాలని అన్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలను ఇలా కలుసుకుంటున్నానన్న తమిళిసై.. ప్రజలు ఉత్సాహంగా ఆహ్వానించడాన్ని చూస్తుంటే గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలో గత పదేళ్లలో పెను మార్పులు వచ్చాయని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు. పదేళ్ల ప్రగతిని చూస్తుంటే ప్రజలు ఈసారి కూడా మోదీకి పట్టం కట్టడం ఖాయమనిపిస్తోందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news