బీజేపీ దేశాన్ని అమ్మేయాలనుకుంటుంది – మమతా బెనర్జీ

-

బిజెపి పై తీవ్ర విమర్శలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బిజెపి దేశాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు మమతా బెనర్జీ. బెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కూచ్ బెహర్ లో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బిజెపి డబుల్ ఇంజన్లు త్వరలోనే అదృశ్యం అవుతాయని అన్నారు.

రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలలో బిజెపి తమ మొదటి ఇంజన్ ను కోల్పోతుందని.. ఇక 2024లో లోక్సభ ఎన్నికలలో రెండో ఇంజన్ ను కోల్పోతుందని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పెద్ద కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. అది త్వరలోనే ఏర్పాటు అవుతుందని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news