PHD స్టూడెంట్ కు బీజేపీ టికెట్.. యంగెస్ట్ అభ్యర్థిగా రికార్డ్

-

అతిపిన్న వయసులో బీజేపీ టికెట్ దక్కించుకున్న నేతగా హేమాంగ్ జోషి రికార్డు సృష్టించారు. గుజరాత్ వడోదర లోక్ సభ స్థానానికి జోషిని అధిష్ఠానం ఎంపిక చేసింది. గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానానికి బీజేపీ టికెట్‌ ఆ పార్టీ యువ నాయకుడు హేమాంగ్ జోషికి దక్కింది. సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్‌ను కాదని హేమాంగ్ జోషికి పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో గుజరాత్‌లో అతిపిన్న వయసులో బీజేపీ లోక్‌సభ టికెట్‌ను దక్కించుకున్న నేతగా హేమాంగ్ జోషి (33) రికార్డును సృష్టించారు.

“గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ఈసారి రాష్ట్రంలోని అందరు లోక్‌సభ అభ్యర్థులకు 5 లక్షల మెజారిటీని టార్గెట్‌గా పెట్టారు. నాకు మాత్రం 10 లక్షల ఓట్ల మెజారిటీని లక్ష్యంగా పెట్టారు. నేను తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధిస్తాను. నాపై ఉన్న ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తాను. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయబోయేది నరేంద్ర మోదూ ప్రధాని అభ్యర్థిత్వానికే తప్ప నాలాంటి అభ్యర్థులకు కాదు” అని హేమాంగ్ జోషి చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news