బ్రేకింగ్: మావో అగ్ర నేత గణపతి లొంగుబాటపై మావోల కీలక ప్రకటన…!

-

మావోయిస్ట్ అగ్ర నేత గణపతి లొంగిపోతున్నారు అనే వ్యాఖ్యలపై మావోయిస్ట్ పార్టీ స్పందించింది. గణపతి సరెండర్ పై మావోయిస్ట్ కేంద్ర కమిటీ కీలక ప్రకటన చేసింది. గణపతి సరెండర్ అనేది పోలీసుల కల్పిత కథ అని కొట్టి పారేసింది. తెలంగాణా, చత్తీస్ఘడ్ నిఘా అధికారుల కల్పిత కథలు మాత్రమే కేంద్ర కమిటీ సభ్యుడు అభి పేరిట ఒక లేఖ బయటకు వచ్చింది. ఇది ఒక హైటెన్షన్ కథ అని అభయ ఆరోపించారు.

గణపతి చిన్న చిన్న అనారోగ్య కారణాల వలన కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నారు అని అభి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం అని అన్నారు. పోలీసులు అల్లిన నాటకంలో మీడియా పావులుగా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం గణపతి పోరాటం చేస్తున్నారని అభయ్ తన లేఖలో స్పష్టం చేసారు. నాలుగు రోజుల నుంచి పలు పత్రికల్లో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news