బ్రేకింగ్: ఇండియాలో చాలా తగ్గిన కరోనా కేసులు

-

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త కేసులు తక్కువగానే ఉన్నాయి అనే చెప్పాలి. నేడు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. గత 24 గంటల్లో భారతదేశంలో 55,079 కేసులు, 876 మరణాలు నమోదయ్యాయని హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,73,166 గా ఉన్నట్టు వెల్లడించింది.

నేటి వరకు కరోనా బారి నుంచి 19,77,780 మంది కోలుకుని బయటపడినట్టు వెల్లడించింది. 51.797 మంది కరోనాతో ప్రాణాలు విడవగా మొత్తం కేసులు 27,02,743 గా ఉందని పేర్కొంది. కరోనా పరీక్షలను కూడా రోజు కంటే నిన్న చాలా ఎక్కువ చేసారు. నిన్న ఒక్క రోజునే మన దేశంలో 9 లక్షల మేర కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. మూడు కోట్లకు పైగా పరిక్షలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news