దారుణం.. ప్రియుడి కోసం కన్న కొడుకునే చంపిన తల్లి

-

కేరళ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ మహిళ తన మూడేళ్ల కుమారున్ని హత్య చేసింది.ఈ దారుణ ఘటన కేరళ పాలక్కాడ్ లోని ఏలప్పుళి లో జరిగింది.మొహమ్మద్ షామీర్, ఆసియా దంపతుల కుమారుడు మొహమ్మద్ షాన్ మంగళవారం ఇంట్లో విగతజీవిగా పడి ఉన్నాడు.పోలీసులు తల్లి ఆసియా ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది.తన కుమారుడిని తానే చంపినట్టు ఆమె పోలీసుల ముందు అంగీకరించింది.

crime

ఆసియా భర్త షామీర్ కు మాటలు సరిగ్గా రావు.ఆమె ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది.ఆసియాకు కుమారుడు ఉన్న విషయం ప్రియుడికి తెలియదు.కొంతకాలానికి అతనికి నిజం తెలియడంతో ఆమెతో మాట్లాడడం మానేసాడు.దీంతో తన ప్రియుడు ఎక్కడ తనకు దూరమవుతాడో అని భావించి ఆసియా తన మూడేళ్ల కొడుకును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.ఆసియా తొలుత పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది.చివరకు తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news